ప్రధానమంత్రి ప్రకటన: స్టాక్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది

Webdunia
బుధవారం, 13 మే 2020 (18:24 IST)
"ప్రధానమంత్రి రూ. 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అనేది ఖచ్చితంగా సరైన దిశలో స్వాగతించే ముందడుగు, ఇది కొంతకాలంగా ఎదురుచూడబడుతోంది. మార్కెట్లు బెంచిమార్క్ సూచికలతో 2.5% కంటే ఎక్కువ పెరిగాయి, ఈ ప్రకటనకు అందరి నుండి ప్రశంసలు అందుతాయి. 
 
కోవిడ్-19 తరువాత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గందరగోళంలో ఉన్నందున, ప్రజలందరికీ విశ్వాసాన్ని కలిగించడానికి పెద్ద మరియు సాహసోపేతమైన చర్యలతో ధైర్యంగా అడుగులు వేయడం ఖచ్చితంగా అవసరం. అయినప్పటికీ, ప్రభుత్వానికి ఉన్న ప్రధాన సవాలు ఏమిటంటే, ఖర్చును, ఆదాయంతో సమతుల్యం చేసుకోవడం ఎలా అనేదే. లేకపోతే మన ఆర్థిక లోటు చేయిదాటి పోవచ్చు, ఇది మన సావరిన్ రేటింగ్‌ను తగ్గించటానికి దారితీస్తుంది.
 
కానీ, అదే సమయంలో, విమానయానం, ఆతిథ్యరంగం, ప్రయాణ మరియు పర్యాటక రంగం మరియు మరెన్నో ఇలాంటి పతనానికి అంచున ఉన్న అనేక పరిశ్రమలను కాపాడటానికి సానుకూల చర్యలు అవసరం. కానీ ఆర్థిక మంత్రి నుండి వివరణాత్మక ప్రకటనల కోసం మేము వేచి ఉండాల్సి ఉంటుంది. 
 
ఇది ఆర్థిక ప్యాకేజీ యొక్క వివరాలపై వివిధ రంగాలకు ఏమి ఉంది అనే స్పష్టత ఇస్తుంది. కానీ, అంతేకాక, ఇది ప్రభుత్వం నుండి స్వాగతించదగిన అడుగు మరియు ఇది స్వావలంబన మార్గంలో భారతదేశం పురోగతికి సహాయపడుతుంది.”
 
- ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ హెడ్ అడ్వైజరీ మిస్టర్ అమర్ డియో సింగ్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments