Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌పై రాములమ్మ ఆగ్రహం, ఏమిటి సంగతి?

Webdunia
బుధవారం, 13 మే 2020 (18:14 IST)
వ్రతం చెడ్డా ఫలం దక్కాలని ఒక పాత సామెత ఉంది. అయితే అలా జరగలేదనే ఇప్పుడు రాములమ్మ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడుతోంది. వివరాలలోకి వెళ్తే... ఒకప్పుడు తెరాసలో ఒక వెలుగు వెలిగి... తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీకి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న విజయశాంతి తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతా వేదికగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. 
 
ఈ మేరకు ఆమె తన పేజీలో... "జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్‌డౌన్ పాటించారు కదా? పాజిటివ్‌ల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయండి. సరైన సంఖ్యలో పరీక్షలు ఇప్పటివరకూ చేయకుంటే ఆ నిజం ఒప్పుకోండి. 
 
అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్థం కాక సతమతమవుతున్నారు. వైన్ షాపులు తెరవడమే ఈ పరిస్థితికి కారణమైతే, అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదై ఉండాలి కదా? ముఖ్యమంత్రి దొరగారు తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనిపిస్తోంది", అంటూ మండిపడ్డారు. మరి... కేసీఆర్ ఏం సమాధానం ఇవ్వనున్నారో.. వేచి చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments