Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం మెరిసిపోవాలంటే పుదీనాతో ఇలా పట్టు వేయాలి

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (21:44 IST)
మహిళలు తమ అందానికి మెరుగులు దిద్దేందుకు చేసే ప్రయత్నాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను కొంటుంటారు. ఐతే అందుబాటులో వుండే వాటితోనే అందంగా మారవచ్చు. 
 
1. పుదీనా రసంలో ఓట్స్ కొంచెం తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేయాలి. ఈ మాస్క్‌ను ముఖం మొత్తం అప్లై చేయాలి. కొద్ది సేపు మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు పుదీనా జ్యూస్‌ని రోజు ఒక గ్లాస్ తాగితే శరీరానికి కొత్త ఉత్తేజం కలుగుతుంది. 
 
2. గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్‌ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది. 
 
3. పుదీనా రసంలో కొద్దిగా పెరుగు మరియు తేనె మిక్స్ చేసి ఈ పేస్ట్‌ని  చర్మానికి పట్టించాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముడుతలు తొలగిపోయి నిగారింపు వస్తుంది. 
 
4. పుదీనా రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్‌సెల్స్‌ను నివారిస్తుంది. అంతేకాక చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments