ముఖం మెరిసిపోవాలంటే పుదీనాతో ఇలా పట్టు వేయాలి

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (21:44 IST)
మహిళలు తమ అందానికి మెరుగులు దిద్దేందుకు చేసే ప్రయత్నాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను కొంటుంటారు. ఐతే అందుబాటులో వుండే వాటితోనే అందంగా మారవచ్చు. 
 
1. పుదీనా రసంలో ఓట్స్ కొంచెం తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేయాలి. ఈ మాస్క్‌ను ముఖం మొత్తం అప్లై చేయాలి. కొద్ది సేపు మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు పుదీనా జ్యూస్‌ని రోజు ఒక గ్లాస్ తాగితే శరీరానికి కొత్త ఉత్తేజం కలుగుతుంది. 
 
2. గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్‌ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది. 
 
3. పుదీనా రసంలో కొద్దిగా పెరుగు మరియు తేనె మిక్స్ చేసి ఈ పేస్ట్‌ని  చర్మానికి పట్టించాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముడుతలు తొలగిపోయి నిగారింపు వస్తుంది. 
 
4. పుదీనా రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్‌సెల్స్‌ను నివారిస్తుంది. అంతేకాక చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రత 43 డిగ్రీల మార్కు

జగన్‌ను జైలులో పెట్టండని జనసేన చెప్పలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ భేషరతుగా వ్యాఖ్యల ఉపసంహరణ

తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్‌ను ధరించి కేన్స్‌లో మెరిసిన రష్మీ

ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి కీలక ప్రోత్సాహం.. రూ.200 కోట్లు కేటాయింపు

కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ: రూ. 50 లక్షల వరకు స్పాట్‌లో మంజూరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments