బలపాలు, మట్టి, బియ్యం తింటున్నారంటే... అది వున్నట్లే...

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (14:39 IST)
మట్టి తినడాన్ని జనం సాధారణంగా తీసుకుంటారు. మరికొందరైతే ఏముందిలే చిన్న పిల్లలు కదా.. కొన్నిరోజులకు వారే మానేస్తారని చాలా ఈజీగా చెపుతుంటారు. ఇలా చేయడం వలన నష్టం ఏమి లేదా అనేది ప్రశ్న. తప్పకుండా నష్టం జరుగుతుంది. ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల్లో ఎందువలన ఈ లక్షణం వస్తుందనే అంశాన్ని పరిశీలిద్దాం. 
 
మట్టి తినడాన్ని మృద్బక్షణ అని అంటారు. ఇది సాధారణంగా రక్త క్షీణత, అజీర్తి, నులి పాములు, ఏలిక పాములు చిన్నపిల్లల కడుపులో ఉన్నపుడు ఈ లక్షణం వస్తుంది. సుద్ధ, మట్టి, నామసుద్ధ, బలపాలు తినాలనిపిస్తుంది. ఇంతటితో ఆగుతుందా అంటే కానే కాదు. ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దాన్ని నిరోధించేందుకు మందులు వాడాలి.
 
కాచిన సింధూరం 50 గ్రా, కాంతలోహ 50 గ్రాములను తేనెతో కలిపి రెండు పూటలా వేయాలి. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇందులో కూడా తీవ్రత ఉంటుంది. ఏలికపాములు, నులి పురుగులు ఉన్నట్లయితే ఒక్క గ్రాము విడంగాది చూర్ణం, 50 గ్రాముల కాసిన సింధూరం తేనేతో కలిపి రెండు పూటలా తినిపించాలి. పండ్ల రసాలు, మామూలు భోజనం, పౌష్టికాహారం ఇవ్వాలి. సరియైన సమయంలో చికిత్స తీసుకోకుండా ఉంటే పాండు రోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments