సీఎం జ‌గ‌న్ ఇక‌పై పిచ్చి నిర్ణ‌యాలు తీసుకోరు: ఎంపీ ర‌ఘురామ‌

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (17:40 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మూడు రాజ‌ధానుల బిల్లును ఉప‌సంహ‌రించుకోవ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ప‌లువురు నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్లు మ‌ళ్ళీ ఇంకో రూపంలో బిల్లు తేవ‌డం ఆత్మ‌హ‌త్య స‌దృశ్య‌మేన‌ని పేర్కొంటున్నారు. 
 
 
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌కృష్ణం రాజు కూడా మూడు రాజ‌ధానుల బిల్లు ర‌ద్దుపై స్పందించారు. ఇది అమరావతి రైతుల విజయం అని, ఇది తథ్యం అని తాను ముందే చెప్పాన‌ని అన్నారు. ఈ రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ వెనుక‌, రైతుల విజయానికి వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఒక కారణమేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తి రైతుల‌తో పాటు తాను కూడా రాజ‌ధాని అమరావతి  కోసం ముడుపు కట్టాన‌ని, ఇది కచ్చితంగా రైతుల విజయమే అని ఎంపీ చెప్పుకొచ్చారు.

 
అయితే, ఇది తాత్కాలిక‌మేన‌ని, మ‌రోసారి స‌మ‌గ్రంగా బిల్లు తెస్తామ‌న్న సీఎం వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు. ఇక ఎలాంటి మెలికలు పెట్టే సాహసం జగన్ చేయలేడ‌ని, ఇక నుంచి అయినా రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టాల‌ని సూచించారు. జగన్ ఇకపై పిచ్చి నిర్ణయాలు తీసుకోరని అనుకుంటున్నా అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు.

 
మ‌రోప‌క్క మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకోవడం హర్షణీయం అని  సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.  అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సాగుతున్న పోరాటానికి ఇది తొలి విజయం అని, అమరావతి రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాల‌ని ఆయ‌న కోరారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నామ‌ని రామకృష్ణ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments