Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ మంత్రుల బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో: కాల్వ శ్రీనివాసులు

ఆ మంత్రుల బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో: కాల్వ శ్రీనివాసులు
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 19 నవంబరు 2021 (16:51 IST)
వైసీపీ మంత్రులు చంద్ర‌బాబును అన‌రాని మాట‌లు అంటున్నార‌ని, భ‌విష్య‌త్తులో ఆ మంత్రుల బ‌తుకులు ఎంత దుర్ల‌భంగా ఉంటాయో అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు అమానుషమని ఆయన మండిపడ్డారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించేలా ఉందని, టీడీపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని, అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి ప్రశ్నించారు. 
 
 
టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మాట్లాడిన వారిని బజారులో పిచ్చికుక్కను కొట్టినట్లు కొడతారని కాల్వ అన్నారు. పిచ్చి కుక్కల కంటే హీనంగా వైసీపీ నాయకులు మాట్లాడారని, కొడాలి నాని సంస్కార హీనుడు.. లుచ్చా రాజకీయం చేస్తున్నాడని కాల్వ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కష్టాలు వచ్చినా నిగ్రహం కోల్పోలేదని, వైసీపీ మంత్రుల బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో ప్రజలే చూస్తారని జోస్యం చెప్పారు. వ్యక్తి దూషణ, కుటుంబ సభ్యులపైన అభాండాలు వేస్తుంటే చూస్తూ ఊరుకోమని కాల్వ హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్భుతమైన అందాలు.. శేషాచలం కొండలు