Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఆవిర్భావదినోత్సవం - దేవుని దయ - ప్రజల చల్లని దీవెనలతో...

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (12:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ పార్టీ ఆవిర్భవించి 11 యేళ్లుపూర్తి చేసుకుని 12వ యేటలోగి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 
 
"దేవుని దయ, ప్రజల చల్లని దేవెనలతో నేడు 12వ యేటలోకి అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి ప్రతి ఇంటా విద్యా ఆర్థిక, సమామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి" అంటూ ట్వీట్ చేశారు. 
 
మరోవైపు ఆ పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా మంత్రి ఆదిమూలపు సురేష్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
తాము పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే అధికారంలోకి వచ్చామని చెప్పారు. గొప్ప సంక్షేమ కార్యక్రమంలో రాష్ట్రం అభివృద్ధితో దూసుకునిపోతుందని చెప్పారు. వైకాపా అధినేత జగన్ ఈ రాష్ట్రానికి 30 యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments