Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయికి జగన్ ఇచ్చిన గౌరవం అందరికీ తెలుసు...

తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయికి జగన్ ఇచ్చిన గౌరవం అందరికీ తెలుసు...
, మంగళవారం, 8 మార్చి 2022 (09:09 IST)
వయసులో పెద్దవారైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను గౌరవించాలని వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ, గవర్నర్‌ను ఎలా గౌరవించాలో తమకు జగన్ చెప్పాల్సిన పనిలేదన్నారు.
 
వయసులో పెద్దవారైన గవర్నర్‌ను గౌరవించాలని జగన్ చెబుతున్నారని, మరి వయుసులో పెద్దవారు, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డికి ఆయనిచ్చిన గౌరవం ఏపాటిదో అందరికీ తెలుసని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 
 
కాగా, సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేస్తూ, గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను కూడా వారు చింపివేశారు. ఈ చర్యలపై సీఎం జగన్ టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యా మేజర్ జనరల్‌ను మట్టుబెట్టిన ఉక్రెయిన్ బలగాలు