Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు జగనన్నతోడు నిధులు విడుదల

నేడు జగనన్నతోడు నిధులు విడుదల
, సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (10:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. జగనన్న తోడు మూడో విడత పథకం కింద లబ్దిదారులకు సోమవారం సొమ్ము విడుదల చేయనున్నారు. 
 
జగనన్న తోడు పథకం మూడో విడత సొమ్ము ఇప్పటికే విడుదల కావాల్సివున్నప్పటికీ ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతితో ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఈ పథకం కింద 5.10 లక్షల మంది లబ్దిదారులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద తొలి విడతలో 5.10 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల మందికి రుణాలు అందజేస్తారు. మూడో విడతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 14.16 లక్షల మందికి ఈ పథకం కింద లబ్ది చేకూరనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అణ్వాయుధ ప్రయోగానికి సిద్ధమవుతున్న రష్యా - పుతిన్ ఆదేశం