Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు : పులివెందులకు శివశంకర్ రెడ్డి తరలింపు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (13:48 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జోరుగా సాగుతోంది. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. తాజాగా కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని  హైదరాబాద్ నగరంలో అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆయనకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన్ను గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్ కోర్టు న్యాయమూర్తి ఇంటిలో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ నుంచి పులివెందులకు దరలించారు. ఇక్కడు వచ్చాక పులివెందుల కోర్టులో హాజరుపరిచయనున్నారు. 
 
ఇదిలావుండగా, వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో అనేక మంది పెద్దల పేర్లను బయటపెట్టిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, దస్తగిరి వాంగ్మూలం తర్వాత ఈ నెల 15 తేదీన విచారణకు రావాలంటూ శివశంకర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసింది. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన హాజరుకాలేదు. ఈ క్రమంలోనే ఆయన్ను సీబీఐ అరెస్టు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments