Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ నేత పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

టీడీపీ నేత పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
, శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:01 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పట్టాభిని ఏపీ పోలీసులు శుక్రవారం మచిలీపట్నం జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పట్టాభికి విజయాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 
 
దీంతో శుక్రవారం ఉదయం ఆయనను మచిలీపట్నం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఉదయం ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం రాజమండ్రికి తీసుకెళ్లారు. పట్టాభిని బుధవారం రాత్రి విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి ఆ రాత్రి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. 
 
ఆ తర్వాత గురువారం ఉదయం తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు ఆలకించిన మేజిస్ట్రేట్ పట్టాభికి నవంబరు రెండో తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ రెడ్డి మూలాలు ఎక్కడ? కాంగ్రెస్‌పై అమరీందర్ ఫైర్