Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (11:36 IST)
ఏపీ మంత్రిమండలి సమావేశంలో బుధవారం జరుగనుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఈ భేటీ సాగుతుంది. ఇందులో సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీపీఎస్ స్థానంలో కొత్త విధానానికి ఆమోదం తెలుపవచ్చన్న వార్తలు వస్తున్నాయి. పాత పింఛన్ పథకానికి సమానంగా ఉండే పథకాన్ని తీసుకునిరానున్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వచ్చే 50 శాతం పింఛన్‌కు తగ్గకుండా, అలానే డీఏ క్రమంగా పెరిగేలా ఆలోచన చేస్తున్నారు. 
 
అదేవిధంగా పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను వేగవంత చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, రెవెన్యూ లోటుతో పాటు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులను వేల కోట్ల రూపాయల మేర విడుదల చేయడం, ఈ ప్రాజెక్టు నిర్మాణ పురోగతి వంటి అంశాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. అలాగే, మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాల, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలను అందజేయాలంటూ గతంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments