Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ కాల్ - రూ.4 కోట్ల నగదు వ్యవహారంపై అవినాశ్ వద్ద సీబీఐ విచారణ

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (13:26 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా సిట్టింగ్ ఎఁపీ అవినాశ్ రెడ్డి మరోమారు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 
 
ముందస్తు బెయిల్ సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాశ్ రెడ్డి శనివారం సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి, రుషికేశవ రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇందులోభాగంగా వరుసగా రెండోవారం ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. 
 
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని బెదిరించడం, రూ.4 కోట్ల నగదు లావాదేవీలతోపాటు సాక్ష్యాలు తారుమారు, వాట్సాప్ కాల్స్ తదితర అంశాలపై అవినాశ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. కాగా... అవినాశ్‌ను ఈ కేసులో 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ అధికారులు, గత శనివారం విచారణకు హాజరైన సమయంలోనే ఆయనను అరెస్టు చేసి... వెంటనే పూచీకత్తు తీసుకుని బెయిలుపై విడుదలైన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అనుచరుడు రుషికేశవ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. 'జమ్మలమడుగుకు వెళ్తుండగా వివేకా హత్య గురించి ఫోన్ రావడంతో వెనక్కి వచ్చాం' అని గతంలో ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అవినాశ్ కాల్ డేటా ఆధారంగా ఆయనను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. రుషికేశవ రెడ్డిది జమ్మలమడుగు పంచాయతీ పరిధిలోని కన్నెలూరు. ఎంపీ ఎక్కడుంటే ఆయనా అక్కడే ఉంటారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments