Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపక్ష నాయకులపై వైసీపీ దాడులు: అచ్చెన్న లేఖ

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (06:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. సంతమాగులూరు మండలంలో వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.
 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థులపై ఈ దాడులు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన కోరారు.

ప్రతిపక్ష అభ్యర్థులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని, ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన చెప్పారు.
 
అలాగే, దాడుల నుంచి రక్షణ కోసం కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. హత్యారాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments