ఏపీ సీఎం జగన్‌కు భవిష్యత్‌ తెలుస్తుంది : యనమల రామకృష్ణుడు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (15:03 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కళ్లముందు తెలుస్తుందని, అందుకే సెంటిమెంట్ ప్రచారానికి తీశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే నవ్యాంధ్రను రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేశారన్నారు. ఇప్పటికే రూ.7.76 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టేశారన్నారు. అందువల్ల సీఎం జగన్ మరోమారు బహిరంగ మార్కెట్‌, కార్పొరేషన్లలై రుణాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని ఆయన కోరారు. 
 
అంతేకాకుండా, సీఎం జగన్‌కు వైకాపా మరోమారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఇపుడే అర్థమైపోయి, భవిష్యత్ కళ్లముందు కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కి తన గురించి, తన పార్టీ గురించే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారంటూ యనమల మండిపడ్డారు. 
 
అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలని జగన్ చూస్తున్నారని అన్నారు. ఏపీలో ఆదాయం లేకపోయినా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని యనమల అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ సమస్యల్లోకి నెట్టేస్తున్న వైకాపా నేతలు తమ తప్పులను ఎత్తిచూపితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments