Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు భవిష్యత్‌ తెలుస్తుంది : యనమల రామకృష్ణుడు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (15:03 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కళ్లముందు తెలుస్తుందని, అందుకే సెంటిమెంట్ ప్రచారానికి తీశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే నవ్యాంధ్రను రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేశారన్నారు. ఇప్పటికే రూ.7.76 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టేశారన్నారు. అందువల్ల సీఎం జగన్ మరోమారు బహిరంగ మార్కెట్‌, కార్పొరేషన్లలై రుణాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని ఆయన కోరారు. 
 
అంతేకాకుండా, సీఎం జగన్‌కు వైకాపా మరోమారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఇపుడే అర్థమైపోయి, భవిష్యత్ కళ్లముందు కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కి తన గురించి, తన పార్టీ గురించే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారంటూ యనమల మండిపడ్డారు. 
 
అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలని జగన్ చూస్తున్నారని అన్నారు. ఏపీలో ఆదాయం లేకపోయినా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని యనమల అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ సమస్యల్లోకి నెట్టేస్తున్న వైకాపా నేతలు తమ తప్పులను ఎత్తిచూపితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments