Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ - భద్రత కట్టుదిట్టం

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (14:12 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పంచాయతీ రాజ్ దివస్‌ను పురస్కరించుకుని ఆయన పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆ రాష్ట్ర పర్యటనకు వెళుతున్నారు. 
 
దాదాపు 30 వేల మంది పంచాయతీ సభ్యులు పాల్గొనే ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం భారీ బందోబస్తును కల్పించారు. ఈ సమావేశం సాంబా జిల్లాల పల్లి పంచాయతీ నుంచి దేశ వ్యాప్తంగా వర్చువల్ విధానంలో ఆయన ప్రసంగించనున్నారు. 
 
ఈ సందర్భంగా రైతులు, సర్పంచులు, గ్రామ పెద్దలు తమ ఆదాయాలు పెంచుకునేలా కొత్త ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
ఇటీవల ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఆ తర్వాత భద్రతా బలగాలు జరిపిన దాడిలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments