Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మే నెలలో దావోస్‌కు వెళుతున్న ఏపీ సీఎం జగన్

మే నెలలో దావోస్‌కు వెళుతున్న ఏపీ సీఎం జగన్
, శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే నెలలో దోవోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం రావడంతో దావోస్‌కు వెళ్లాలని నిర్ణయించారు. 
 
నిజానికి ఈ సదస్సు గత యేడాది డిసెంబరు నెలలోనే జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సదస్సును వాయిదా వేశారు. గత రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్ విధానంలోనే జరుగుతున్నాయి. ఈ దఫా మాత్రం భౌతికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మే నెలలో ఆయన దావోస్‌కు వెళ్లి ఈ సదస్సులో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు