Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక‌పై అది ‘అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్ వే ’!

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (18:18 IST)
యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం, యమునా ఎక్స్‌ప్రెస్‌వే పేరును మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్‌వేగా మార్పు చేయనుంది. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే సమయంలో పేరు మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆరు లైన్ల 165 కిలోమీటర్ల పొడవైన యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవే గౌతమ్‌బుద్ధనగర్‌ జిల్లాలోని గ్రేటర్‌ నోయిడాను ఆగ్రాతో కలుపుతుంది. ఈ హైవే దేశంలోనే మూడో అతిపెద్ద పొడవైంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించారు.
 
అటల్‌ బిహారీ వాజ్‌పేయి దేశానికి మూడుసార్లు ప్రధానిగా సేవలందించిన అందరి నుంచి మన్ననలు అందుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఈ హైవేకు పేరు పెట్టాలని యూపీ సీఎం భావిస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం ప్రధాని శంకుస్థాపన చేయనుండగా, దీంతో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలున్న ఏకైక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవుతుంది. ఇంతకు ముందు యూపీ ప్రభుత్వం 2018లో లక్నోలోని ఏకనా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరును ‘భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం’గా మార్చింది. ఈ పేరు మార్పుల వ‌ల్ల ఏం ఒరుగుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు యోగి ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌డుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments