Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక‌పై అది ‘అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్ వే ’!

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (18:18 IST)
యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం, యమునా ఎక్స్‌ప్రెస్‌వే పేరును మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్‌వేగా మార్పు చేయనుంది. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే సమయంలో పేరు మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆరు లైన్ల 165 కిలోమీటర్ల పొడవైన యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవే గౌతమ్‌బుద్ధనగర్‌ జిల్లాలోని గ్రేటర్‌ నోయిడాను ఆగ్రాతో కలుపుతుంది. ఈ హైవే దేశంలోనే మూడో అతిపెద్ద పొడవైంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించారు.
 
అటల్‌ బిహారీ వాజ్‌పేయి దేశానికి మూడుసార్లు ప్రధానిగా సేవలందించిన అందరి నుంచి మన్ననలు అందుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఈ హైవేకు పేరు పెట్టాలని యూపీ సీఎం భావిస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం ప్రధాని శంకుస్థాపన చేయనుండగా, దీంతో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలున్న ఏకైక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవుతుంది. ఇంతకు ముందు యూపీ ప్రభుత్వం 2018లో లక్నోలోని ఏకనా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరును ‘భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం’గా మార్చింది. ఈ పేరు మార్పుల వ‌ల్ల ఏం ఒరుగుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు యోగి ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌డుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments