Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్తాన్ ని మించిపోయింది: నారా లోకేష్

Advertiesment
tdp
విజ‌య‌వాడ‌ , బుధవారం, 24 నవంబరు 2021 (18:02 IST)
ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ గా పనిచేశారనే కక్షతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువులో సైదా అనే టీడీపీ కార్యకర్తపై కొందరు దాడి చేశారు. రోడ్డుపై సైదా బైక్ పై వెళ్లి వస్తుండగా,  అడ్డగించి రాళ్ళతో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడ్డ సైదాని అక్క‌డే ఉన్న స్థానికులు, బంధువులు  ఆస్పత్రికి తరలించారు. 

 
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త సైదాపై దాడిని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీ మూకలు నరరూప రాక్షసుల కంటే ఘోరంగా దాడి చేయడం చూస్తే, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భీతిగొలుపుతోంద‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.


పొలం తగాదా నెపంతో వైసీపీ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని లోకేష్ చెప్పారు. పోలీసులు నిద్ర నటిస్తుంటే, వైసీపీ  ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయ‌ని నారా లోకేష్  ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత మేనకోడలికే వేద నిలయం.. మద్రాస్ హైకోర్టు