Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్తాన్ ని మించిపోయింది: నారా లోకేష్

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (18:02 IST)
ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ గా పనిచేశారనే కక్షతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువులో సైదా అనే టీడీపీ కార్యకర్తపై కొందరు దాడి చేశారు. రోడ్డుపై సైదా బైక్ పై వెళ్లి వస్తుండగా,  అడ్డగించి రాళ్ళతో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడ్డ సైదాని అక్క‌డే ఉన్న స్థానికులు, బంధువులు  ఆస్పత్రికి తరలించారు. 

 
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త సైదాపై దాడిని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీ మూకలు నరరూప రాక్షసుల కంటే ఘోరంగా దాడి చేయడం చూస్తే, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భీతిగొలుపుతోంద‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.


పొలం తగాదా నెపంతో వైసీపీ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని లోకేష్ చెప్పారు. పోలీసులు నిద్ర నటిస్తుంటే, వైసీపీ  ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయ‌ని నారా లోకేష్  ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments