Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులంటే అంత చులకనా... చొక్కా విప్పి కొడతారా: మహిళా ఏఎస్ఐ ఆవేదన

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (08:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సమయంలో మంత్రి సీదిరి అప్పలరాజు తాను మంత్రినన్న విచక్షణను మరిచిపోయి విధుల్లో ఉన్న సీఐని దుర్భాషలాడారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. విధుల్లో ఉన్న తమ అధికారిని ప్రజాప్రతినిధి దుర్భాషలాడటంపై విశాఖకు చెందిన ఓ మహిళా ఏఎస్ఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో ఓ ఆడియోను పోస్ట్ చేశారు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
"సార్ నమస్తే అంటూ ఆమె తన ఆవేదనను ప్రారంభించారు. పోలీసులంటే అందరికీ లోకువేనా సర్ అని ప్రశ్నిచారు. మీతో మాట్లాడాలన్నా తనకు ఏడుపు వస్తుందన్నారు. ప్రతిసారి పోలీసులను బూతులు తిట్టడమేనా? అని ప్రశ్నించారు. సీఎం ప్రోటోకాల్ ఎంతో కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మా విధులు మేం నిర్వహించడం కూడా తప్పేనా? అని నిలదీశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అలా తిరగబడటం కరెక్టేనా?" అని ప్రశ్నించారు. 
 
మీ బందోబస్తు కోసం ఉదయం నుంచే రోడ్లపై పడిగాపులు పడుతున్నారు. పై అధికారుల అదేశాలను పాటించడం కూడూ తప్పేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత రాజకీయ నాయకుడు అయితే మాత్రం పోలీసు ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments