Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులంటే అంత చులకనా... చొక్కా విప్పి కొడతారా: మహిళా ఏఎస్ఐ ఆవేదన

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (08:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సమయంలో మంత్రి సీదిరి అప్పలరాజు తాను మంత్రినన్న విచక్షణను మరిచిపోయి విధుల్లో ఉన్న సీఐని దుర్భాషలాడారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. విధుల్లో ఉన్న తమ అధికారిని ప్రజాప్రతినిధి దుర్భాషలాడటంపై విశాఖకు చెందిన ఓ మహిళా ఏఎస్ఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో ఓ ఆడియోను పోస్ట్ చేశారు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
"సార్ నమస్తే అంటూ ఆమె తన ఆవేదనను ప్రారంభించారు. పోలీసులంటే అందరికీ లోకువేనా సర్ అని ప్రశ్నిచారు. మీతో మాట్లాడాలన్నా తనకు ఏడుపు వస్తుందన్నారు. ప్రతిసారి పోలీసులను బూతులు తిట్టడమేనా? అని ప్రశ్నించారు. సీఎం ప్రోటోకాల్ ఎంతో కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మా విధులు మేం నిర్వహించడం కూడా తప్పేనా? అని నిలదీశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అలా తిరగబడటం కరెక్టేనా?" అని ప్రశ్నించారు. 
 
మీ బందోబస్తు కోసం ఉదయం నుంచే రోడ్లపై పడిగాపులు పడుతున్నారు. పై అధికారుల అదేశాలను పాటించడం కూడూ తప్పేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత రాజకీయ నాయకుడు అయితే మాత్రం పోలీసు ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments