Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో మరో 'స్వాతి'.. ప్రియుడి మోజులో భర్త హత్య... కిరాయి రూ.లక్ష

ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన స్వాతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపింది.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (16:15 IST)
ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన స్వాతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపింది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో ఇల్లాలు. బ్రాహ్మణపల్లెలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన వడ్డె చిన్న మద్దలేటి అలియాస్ మద్దయ్య (35), తన అక్క కుమార్తె వెంకటేశ్వరమ్మను ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన ముల్ల మహబూబ్ బాషాతో వెంకటేశ్వరమ్మకు ఏర్పడిన పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
విషయం తెలిసిన మద్దయ్య భార్యను నిలదీశాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు బాషాతో  కలిసి వెంకటేశ్వరమ్మ హత్యకు ప్లాన్ చేసింది. బేతంచెర్ల మండలంలోని బలపాలపల్లెకు చెందిన మనోహర్‌తో భర్త హత్యకు బేరం కుదుర్చుకుంది. లక్ష రూపాయలకు ఒప్పందం కుదరగా తొలుత రూ.80 వేలు అడ్వాన్స్‌గా చెల్లించింది. తమ ప్లాన్‌లో భాగంగా, మద్దయ్యకు మనోహర్ స్నేహితుడిగా మారాడు. 
 
దీంతో అపుడపుడూ వీరిద్దరూ కలిసి మద్యం పార్టీల్లో పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన మద్దయ్యను పూడిచెర్లకు వెళ్లి ఇద్దరూ మద్యం సేవించారు. మద్దయ్య మద్యం ఫుల్‌గా సేవించడంతో  మత్తులోకి జారుకున్నాడు. ఇదే అదునుగా భావించిన మనోహర్‌ తన స్నేహితుడైన బలపాలపల్లెకే చెందిన మల్లికార్జున్ సాయంతో మద్దయ్యను బండరాయి మోది హతమార్చాడు. 
 
దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా భార్య వెంకటేశ్వరమ్మను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్య కేసు నమోదు చేసి నిందితులందరినీ అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments