Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినాశ్ రెడ్డి తల్లిని కర్నూలు ఆస్పత్రిలోనే ఎందుకు అడ్మిట్ చేశారు?

Webdunia
ఆదివారం, 21 మే 2023 (11:18 IST)
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప సిట్టింగ్ వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి.. సీబీఐతో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఈ నెల 19 తేదీన శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిన ఆయన డుమ్మాకొట్టారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదంటూ హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. అయితే, అనారోగ్యానికి గురైన తల్లిని హైదరాబాద్ నగరంలో కూడా కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
సాధారణంగా రాయలసీమ ప్రాంత వాసులు అనారోగ్యానికి గురైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లేదా బెంగళూరుకు తీసుకెళ్తుంటారు. కానీ, అవినాశ్ తన తల్లిని అనూహ్యంగా కర్నూలుకు తీసుకొచ్చి విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించడం చర్చనీయాంశమైంది. విశ్వభారతి ఆసుపత్రి అధినేత డాక్టర్ కాంతారెడ్డి అల్లుడైన డాక్టర్ హితేష్ రెడ్డి స్వగ్రామం పులివెందుల సమీపంలోని సింహాద్రిపురం. 
 
హితేష్ రెడ్డికి అవినాశ్ రెడ్డితో స్నేహంతోపాటు దూరపు బంధుత్వం కూడా ఉంది. దీంతోపాటు విశ్వభారతి ఆసుపత్రిలో జనరల్ ఫిజీషియన్‌కు సీఎం కార్యాలయంలో మంచి పరిచయాలున్నాయి. అక్కడి నుంచి వచ్చిన సూచన మేరకు కర్నూలు ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. పైగా, కొందరు న్యాయవాదులు శుక్రవారం ఉదయమే ఆసుపత్రికి వచ్చి పరిశీలించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నానికి ఆమె అనారోగ్యానికి గురికావడం ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించడం, అవినాశ్ రెడ్డి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్లిపోవడం అంతా గంటల్లో జరిగిపోయింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments