Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరం : వైద్యులు వెల్లడి

Webdunia
ఆదివారం, 21 మే 2023 (10:53 IST)
అనారోగ్యంపాలైన కడప వైకాపా ఎంపి అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ హితేష్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం చేసిన పరీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చిందని.. అది గుండెపోటు వచ్చే అవకాశాన్ని సూచిస్తోందన్నారు. 
 
అందువల్ల యాంజియోగ్రామ్ నిర్వహించగా ఆమెకు రెండు నరాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. రక్తపోటు తక్కువగా ఉందని, అది సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు ఎలాంటి వైద్యం అందించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
 
ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, మరికొన్ని రోజులపాటు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అవినాష్ తల్లి లక్ష్మమ్మ విశ్వభారతి ఆసుపత్రిలో నాలుగో అంతస్తులోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన అయిదో అంతస్తులో ఉండి తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments