Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్నేహితుడిని చూసేందుకు వచ్చి పాడుపని చేసిన వ్యక్తికి దేహశుద్ధి

video
, సోమవారం, 13 మార్చి 2023 (08:31 IST)
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో పాడుపనికి పాల్పడ్డాడు. దీంతో అతనికి దేహశుద్ధి చేశారు. రోగి సహాయకురాలు స్నానం చేస్తుండగా, వీడియో తీశాడు. దీన్ని గమనించిన బాధితురాలు కేకలు వేయడంత నిందితుడిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఆస్పత్రిలో జరిగింది. 
 
ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని చూసేందుకు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వకు చెందిన ఏలియా అనే వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. ఆ సమయంలో రోగి సహాయకురాలు స్నానం చేస్తుండటాన్ని గమనించిన ఏలియా.. గోడెక్కి వీడియో తీశాడు. దీన్ని బాధితురాలు గమనించి, పెద్దగా కేకలు వేసింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఏలియాను పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే సీఎం జగన్ ఇంటికే : పవన్ కళ్యాణ్