Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్...

Webdunia
సోమవారం, 31 జులై 2023 (15:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లు పెట్రేగిపోతున్నారు. ఇప్పటికే అత్యాచారాలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ వచ్చిన వారు.. తాజాగా ఏకంగా హత్య చేశారు. విశాఖపట్టణంలో ఒక వాలంటీర్ ఏకంగా ఓ వృద్ధురాలిని చంపేశాడు. మృతురాలిని వరలక్ష్మిగా గుర్తించారు. ఆమె వద్ద ఉన్న బంగారం, డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు.
 
దీనిపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ హత్యకు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా బాధ్యులమేనని చెప్పారు. ఈ హత్యకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
వాలంటీర్లు చేస్తున్న పని ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేయడం మినహా వారు చేస్తున్న పని ఏమిటని నిలదీశారు. మహిళల ఫోటోలను కూడా వాలంటీర్లు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పింఛన్‌ను వార్డు సభ్యుడు కూడా ఇవ్వొచ్చని లేదా పింఛన్ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయొచ్చని ఆయన సూచించారు. 
 
ఒక ఇంటి నంబరుపై 500కు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారని, దొంగ ఓట్లు ఉన్న వారి పింఛన్ ఎవరి ఖాతాల్లోకి వెళుతుందని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం సిగ్గు లేకుండా కేసు పెట్టిందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments