Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా కూతురుపై రెక్కీ నిర్వహించిన వ్యక్తి అరెస్ట్

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (16:13 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త మ‌లుపు ఇది. పెద్దాయ‌న హ‌త్య చేసింది ఎవ‌రు అనేది సీబీఐ విచార‌ణ కొన‌సాగుతుండ‌గా, క‌థ ప‌లు మ‌లుపులు తిరుగుతోంది.

తాజాగా వివేకా కుమార్తెను చంపేందుకు రెక్కీ నిర్వ‌హిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ కేసు విచారిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి డీజీపీ, సీబీఐ, కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి తమ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడని ఆరోపిస్తూ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఈ నెల 10న ఆ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీతరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశారు. దీంతో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు నిందితుడు మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రెక్కీ నిర్వహించడానికి కారణాలు ఏంటి? ఫోన్లు ఎవరెవరికి చేశారు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు.

దీనితో ఇపుడు క‌థ కొత్త మ‌లుపు తిరిగిన‌ట్ల‌యింది. అస‌లు మ‌ణి కంఠారెడ్డి ఈ రెక్కీ ఎందుకు చేస్తున్నాడు? ఎవ‌రు ఆయ‌న‌తో ఈ ప‌నులు చేయిస్తున్నార‌నే కోణంలో సి.బి.ఐ. విచార‌ణ మ‌లుపు తిరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments