Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 March 2025
webdunia

పడగ గదిలో భర్త శవం.. అక్కడే ప్రియుడితో భార్య ఎంజాయ్.. ఎక్కడ?

Advertiesment
పడగ గదిలో భర్త శవం.. అక్కడే ప్రియుడితో భార్య ఎంజాయ్.. ఎక్కడ?
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (13:23 IST)
ఓ మహిళ తన ప్రియుడుతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. దీన్ని ఓ రోజున భర్త చూశాడు. అంతే.. అతని అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసి... తమ పథకం ప్రకారం పడక గదిలోనే భర్తను మట్టుబెట్టింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఆ పడక గదిలోనే 12 గంటల పాటు ఎంజాయ్ చేశారు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో జరిగింది. 
 
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని సోమ‌మంగ‌ళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమ‌లారాణి(37) అనే దంపతులు ఉన్నారు. అయితే, విమలకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువ‌కుడితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. 
 
ఈ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌డంతో ఆమెను ప‌లుమార్లు మంద‌లించాడు. అయిన‌ప్ప‌టికీ ఆమెలో మార్పు రాలేదు. ఈ క్ర‌మంలో కొద్ది రోజుల క్రితం దంప‌తుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఈ గొడ‌వ‌ల నేప‌థ్యంలో భ‌ర్త‌ను చంపాల‌ని భార్య నిర్ణ‌యించుకుంది. దీంతో జులై 28న రాత్రి త‌న ప్రియుడును పడక గదికి పిలిపించింది. కొద్దిసేపు ఏకాంతంగా గడిపారు. ఇంతలో భర్త ఇంటికి వచ్చి పడక గదిలో భార్య చేస్తున్న పాడుపనిని చూశాడు. 
 
ఆ తర్వాత ఆమెను కొట్టేందుకు పడకగదిలోకి వెళ్లగా, తన ప్రియుడితో కలిసి భర్తను విమలా రాణి చంపేసింది. భ‌ర్త‌ను చంపిన త‌ర్వాత అత‌ని మృత‌దేహం అక్క‌డే ఉంచి.. రాణి, ఆమె ప్రియుడు బెడ్‌రూమ్‌లోనే 12 గంట‌ల పాటు గ‌డిపారు. ఆ త‌ర్వాత డెడ్‌బాడీని చెంగ‌ల్‌ప‌ట్టు తీసుకెళ్లి నిప్పంటించిన‌ట్లు రాణి తెలిపింది. ఈ కేసులో విమలా రాణిని పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ కూతుర్ని అత్యాచారం చేసిన తండ్రి.. పదేళ్ల జైలు శిక్ష