Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేధింపుల కేసుపెట్టిన భార్య - ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

వేధింపుల కేసుపెట్టిన భార్య - ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:44 IST)
ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఎక్కువైపోతున్నాయి. దీంతో ఒకరిని ఒకరు వేధించుకుంటున్నారు. తద్వారా తమ పచ్చని కాపురంలో నిప్పు రాజేసుకుంటున్నారు. తాజాగా పోలీస్ కానిస్టేబుల్ భార్య భర్తపై వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆ కానిస్టేబుల్ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో టీఎస్‌పీఎస్‌సీ కానిస్టేబుల్‌‌గా రాంబాబు అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈయన కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్న రాంబాబుపై ఆయన భార్య వేధింపుల కేసు పెట్టింది.
 
ఒక యేడాది కాలంగా విధులకు వెళ్లకుండా తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలో మనస్తాపంతోనే రాంబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయుధ బలగాల పరేడ్ సాధనను పరిశీలించిన జిల్లా ఎస్పీ