Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మమ్మల్ని కూడా చంపేస్తారు.. ప్రాణాలు కాపాడండి.. : వివేకా కుమార్తె లేఖ

Advertiesment
Dr Sunitha
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:14 IST)
తమను కూడా చంపేస్తారన్న భయం వెంటాడుతుందని, అందువల్ల తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కోరారు. ఈ మేరకు ఈమె కడప ఎంపీ అన్బురాజ్‌కు ఓ లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని లేఖలో కోరారు. 
 
ఈనెల 10న పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని తన లేఖలో గుర్తుచేశారు. మణికంఠ రెడ్డి వైకాపా నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి అనుచరుడిగా ఆమె వివరించారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని, ఇప్పుడు అతని అనుచరుడు రెక్కీ నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె లేఖలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ, డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలు పంపారు. లేఖతో పాటు సీసీ కెమెరా దృశ్యాల పెన్‌డ్రైవ్‌లు కూడా పంపినట్లు లేఖలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ రద్దు...కరోనా ఎఫెక్ట్