Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనర్ బాలికతో ప్రేమికుడి సహజీవనం - ఓకే చెప్పిన హైకోర్టు

మైనర్ బాలికతో ప్రేమికుడి సహజీవనం - ఓకే చెప్పిన హైకోర్టు
, గురువారం, 10 జూన్ 2021 (09:36 IST)
పంజాబ్ - హర్యానా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మైనారిటీ కూడా తీరని ఓ మైనర్ బాలికతో ప్రేమికుడు సహజీవనం చేసేందుకు కోర్టు సమ్మతించింది. సహజీవనం చేయాలని జంట నిర్ణయించుకున్నందున తీర్పులు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది. 
 
పంజాబ్‌లోని బఠిండాలో నివసించే ఒక జంట వేసిన వేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... వివాహం చేసుకోకుండానే పిటీషనర్లు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు, వారి నిర్ణయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని జస్టిస్ సత్ ప్రకాశ్ వ్యాఖ్యానించారు. 
 
మైనారిటీ కూడా తీరని ఒక యువతి (17), 20 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. బాలికకు మరో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సమాయత్తం కాగా, ఈ జంట కోర్టును ఆశ్రయించింది. తల్లిదండ్రుల ప్రయత్నాలు తెలిసి ఇళ్లు విడిచి ప్రేమికుడి వద్దకు చేరుకున్నానని, రక్షణ కల్పించాలని వేడుకుంది. 
 
బాలిక మైనరిటీ తీరకపోవడంతో 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అప్పటివరకు సహజీవనం చేస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో జంటకు రక్షణ కల్పించడం మా బాధ్యత అని హైకోర్టు జడ్జి జస్టిస్ సంత్ ప్రకాశ్ వ్యాఖ్యానించి, ఆ జంటకు భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.1438 కోట్లు విడుదల