Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ రద్దు...కరోనా ఎఫెక్ట్

రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ రద్దు...కరోనా ఎఫెక్ట్
విజయవాడ , శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:06 IST)
ప్రస్తుత కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని రాజ్ భ‌వ‌న్లో ఎట్ హోమ్ ర‌ద్దు అయింది. స్వాతంత్ర‌ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నిర్ణయించారని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గౌరవ గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అవార్డు విజేతలు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా పాల్గొనేవారు. కరోనా తీవ్ర‌త నేపధ్యంలో ప్రస్తుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించరాదని గవర్నర్ ఆదేశించినట్లు ముఖేష్ కుమార్ మీనా వివరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ముసుగు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం వంటి కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించటం ద్వారా కోవిడ్ నుండి రక్షణ పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అర్హులైన వారందరూ ప్రాధాన్యత ఆధారంగా టీకాలు వేయించుకోవాలని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా తగిన ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందా?