Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో అదృశ్యమై విజయవాడలో శవమైన మహిళా టెక్కీ

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (11:01 IST)
గుంటూరులో అదృశ్యమైన ఓ మహిళా టెక్కీ విజయవాడలో విగతజీవిగా కనిపించింది. ఆదివారం ఇంటి బయటకు వెళ్లిన తనూజ అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... విజయవాడలో మృత్యువాతపడింది. దీనిపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని నిర్ధారించారు. దీంతో టెక్కీ తనూజ మరణంపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన తనూజ అనే యువతి టెక్కీగా పని చేస్తున్నారు. ఈమెకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మణికంఠతో వివాహమైంది. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తనూజ ఆపై ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు తమకు తెలిచిన ప్రదేశాల్లో గాలించారు. అయినా ఫలితం లేదు. ఈ క్రమంలో సోమవారం నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో తనూజ మృతదేహం విజయవాడ మాచర్ల రహదారిలో కనపించింది. 
 
దీంతో ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయివుంటుందని తొలుత పోలీసులు భావించారు. కానీ, ఆమె శరీరంపై చిన్నపాటి గాయం లేదా రక్తపు మరక లేకపోవడంతో పోలీసులు హత్యగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments