Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్లదాడి

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (08:46 IST)
ఈ నెల 19వ తేదీ నుంచి సికింద్రాబాద్ - విశాఖపట్టణంల మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పచ్చజెండా ఊపి రైలును ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రైలు ట్రయల్ రన్ కోసం బుధవారం విశాఖపట్టణంకు తరలించారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం వైజాగ్‌కు వంందే భారత్ రైలు వచ్చింది. అయితే, ఈ రైలుపై కొందరు అకతాయిలు రాళ్లతో దాడి చేశారు. 
 
ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు పగిలిపోయాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన ఈ రైలు మర్రిపాలెం యార్డుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది రాళ్లదాడేనని వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు నిర్ధారించారు. మరోవైపు, ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు. రైల్వే ఆస్తులు కూడా ప్రజా ఆస్తులే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments