Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరంలో వైసిపి వల్లభనేని వంశీ హవా: యార్లగడ్డ వెంకట్రావు గరంగరం

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (19:00 IST)
గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తరపున గెలిచి వైసీపీలోనికి దొడ్డిదారిన వచ్చి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలోనికి వంశీ వచ్చాక నియోజిక వర్గంలోనికి అడుగు పెట్టకూడదని అనుకున్నానని చేప్పారు.
 
కానీ అసలైన పార్టీ కార్యకర్తలు అవమానాలకు గురవుతున్నారని, కేసుల పాలవుతున్నారని, ఇవన్నీ చూడలేక మళ్లీ నియోజక వర్గంలో అడుగుపెట్టానని తెలిపారు. మరోవైపు తన జన్మదిన వేడుకలను నిర్వహించకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై యార్లగడ్డ మండిపడ్డారు. నున్నలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీ కాన్వాయ్‌లో ఆయన వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
 
సెక్షన్ 144 అమలులో ఉందని ఇంతమంది రావడానికి వీలు పడదని చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ వంశీపై విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా, పర్యాటక రంగాలకు జీఎస్టీ స్లాబు ఊతం :కందుల దుర్గేష్

లిటిల్ హార్ట్స్ సక్సెస్ అవుతుందని ముందే చెప్పా : మౌళి తనుజ్

JD Chakravarthy: డబ్బుని మంచినీళ్లు లాగా ఖర్చు పెడుతున్నారు : జెడీ చక్రవర్తి

Nani: మోహన్ బాబు కీలక పాత్రలో నాని ది ప్యారడైజ్ చిత్రం

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments