Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెదేపా మునిగిపోయే నావ.. వంశీ సవాళ్ళకు ఆన్సర్ ఇవ్వండి : విజయసాయి రెడ్డి

Advertiesment
Vijayasai Reddy
, ఆదివారం, 17 నవంబరు 2019 (14:14 IST)
తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల తెదేపా అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఈ విమర్శలను తెదేపా నేతలు తిప్పికొడుతున్నారు. 
 
వీటిపై విజయసాయి రెడ్డి స్పందించారు. 'వల్లభనేని వంశీ వదిలిన సవాళ్లకు తెలుగుదేశం పార్టీ జవాబిచ్చే పరిస్థితిలో ఉందా? మాలోకం ఏదో అన్నాడు కాని ఎవరూ పట్టించుకోలేదు. మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది. చివరకు తండ్రీకొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారు. ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుంది' అని అన్నారు. 
 
''బంగారు బాతు' అమరావతిని చంపేశారని చంద్రబాబు గారు శోకాలు పెడుతున్నదెందుకో ఇప్పుడర్థమైంది. అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టు పొందిన సంస్థ రూ.500 కోట్లు ముట్ట చెప్పిందని ఇన్‌కంటాక్స్ వాళ్లు బయట పెట్టిన తర్వాత లింకులు, బొంకులన్నీ ఒక్కటొకటిగా వెలుగు చూస్తున్నాయి' అని విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకానికి ఎయిరిండియా.. బీపీసీ కూడా... నిర్మలా సీతారామన్ వెల్లడి