Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరుచుకోని టిటిడి వెబ్ సైట్, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద భక్తుల పడిగాపులు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:27 IST)
ఆగష్టు నెలకు సంబంధించిన దర్సన టోకెన్లు విడుదలైపోయాయి. హాట్ కేకుల్లా భక్తులు టోకెన్లను పొందారు. అయితే కొన్ని టోకెన్లు మిగిలాయి. 3వేల టోకెన్లు దాకా ఉన్నాయి. ఆగష్టు 31వ తేదీ వరకు ఈ టోకెన్లు 3 వేలు దాకా ఉన్నట్లు టిటిడి తెలిపింది. కావాల్సిన భక్తులు ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.
 
దీంతో భక్తులు స్వామవారి దర్సన టోకెన్ల కోసం తిరుపతి బాలాజీ ఎపి.జిఓవి.ఇన్ వెబ్ సైట్‌ను ఓపెన్ చేశారు. ఇంటర్నెట్ సెంటర్ల వద్ద టోకెన్ల పొందేందుకు భక్తులు బారులు తీరారు. చాలాసేపటి వరకు ఆ సైట్ ఓపెన్ కాలేదు. సుమారు గంటపాటు శ్రమించి చివరకు భక్తులు నిరాశకు గురయ్యారు.
 
అయితే మధ్యాహ్నం 1 గంట తరువాత టిటిడి మరోసారి ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులెవరూ నిరాశకు గురికావాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతుందని తెలిపింది. అయినా కూడా సైట్ ఓపెన్ కాలేదు. 
 
ఆఫ్ లైన్లో టిక్కెట్లు ఆగిపోవడం.. కనీసం ఆన్ లైన్లోనైనా టోకెన్లు పొంది స్వామివారి దర్సనం పొందాలనుకుంటున్న శ్రీవారి భక్తులు సైట్ ఓపెన్ కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే టోకెన్లు విడుదల చేసే తిరుపతిలోని ఇడిపి కార్యాలయంలో సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments