Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ చరియలు విరిగిపడ్డాయి.. ప్రాణాలతో బయటపడ్డాం.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:25 IST)
హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో ఘోర దుర్ఘటనలో తొమ్మిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొండ చరియలు విరిగిపడటంతో ఓ బ్రిడ్జికూడా కూలిపోయింది. ఇదే ఘటనలో రాజస్థాన్‌కు చెందిన వైద్యురాలు దీపాశర్మ దుర్ఘటన జరగటానికి 25 నిమిషాల ముందు తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరలైంది.

అయితే తాజాగా ఘటన సందర్భంలో గాయాలతో బయటపడ్డ బాధితుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియో ఘటన జరిగిన సందర్భంలో సెల్ ఫోన్ తో ప్రమాదం నుండి బయటపడినవారి నుండి ఘటన వివరాలను చిత్రీకరించారు.
 
నవీన్, శిరిల్ అనే ఇద్దరు వ్యక్తులు తలకు గాయాలతో వీడియోలో కనిపిస్తున్నారు. వారిలో ఒకరు చెప్పిన సమాచారం బట్టి ఘటన జరగటానికి 10 నిమిషాల ముందు ఘాట్ రోడ్డులో కారు నిలిపి ఉంచామని , కొండ పైభాగం నుండి బండరాళ్ళు ఒక్కసారిగా దూసుకురావటంతో తమ కారు నుజ్జునుజ్జు అయిందని తెలిపాడు. 
 
ఎలాగోలా తాను ప్రాణాలతో కారునుండి బయటపడ్డానని… కొద్ది సేపటి తరువాత పెద్ద మొత్తంలో దుమ్ముదూళి, రాళ్ళు పడిపోవటంతో కారు ఆనవాలే కనిపించకుండా పోయిందన్నాడు. విరిగిపడ్డ కొండచరియల దృశ్యాలు చాలా స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నాయి. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments