Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిమాచల్‌లో విషాదం : 9 మంది టూరిస్టుల మృతి

హిమాచల్‌లో విషాదం : 9 మంది టూరిస్టుల మృతి
, ఆదివారం, 25 జులై 2021 (17:18 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది. కొండ చరియలు విరిగిపడటంతో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఈ కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీయగా అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
రాష్ట్రంలోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగ్లా - చిత్కుల్ రహదారిలలో బత్సేరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులంతా ఢిల్లీకి చెందిన వారేనని అక్కడి అధికారులు చెప్పారు. 
 
ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకొచ్చాయి. బత్సేరి లోయలో ఉన్న ఓ బ్రిడ్జిపై పడడంతో అది కుప్పకూలింది. అంతేకాదు పక్కనే ఉన్న పలు కార్లలపై బండరాళ్ల పడ్డాయి. ఈ ఘటనలో పలు కార్లు, పర్యాటకుల విశ్రాంతి గదులు ధ్వంసమయ్యాయి. చిత్కుల్ నుంచి సంగ్లాకు వెళ్తున్న ఓ వాహనంపై పడడంతో అందులో ప్రయాణిస్తున్న 9 మంది చనిపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏలూరు కార్పొరేషన్‌లో వైకాపా జెండా - 47 చోట్ల ఘన విజయం