Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉగాది కానుక

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:06 IST)
హైదరాబాద్ మహానగరంలోని మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉగాది కానుక ఇవ్వనున్నారు. అటు ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు.. ఇటు ఆదాయాన్ని రాబట్టుకునే దిశగా హైదరాబాద్ మెట్రో చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని స్మార్ట్ కార్డు ధరను రూ.75కే అందజేయనుంది. ఈ సదుపాయం మూడు నెలల వరకు కల్పించనుంది. 
 
ఇప్పటివరకూ ఈ కార్డు కోసం రూ.150 లు చెల్లించాల్సి వచ్చేది. ఇది సామాన్య ప్రయాణీకులకు భారంకాగా.. మెట్రో ఎక్కేందుకు సామాన్యులు ఆసక్తిని చూపించటంలేదు. ఈ క్రమంలో ప్రయాణీకులు మెట్రో ఎక్కేలా చేసేందుకు ఉగాది పండుగ సందర్భంగా స్మార్ట్ కార్డ్ రేటును హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం తగ్గించింది. 
 
ఇందులో రూ.50 వరకు ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. నగదు అయిపోగానే కనీసం రూ.50, ఎక్కుగా (గరిష్టంగా) 3 వేల వరకు రీఛార్జ్‌ చేసుకొనే అవకాశం కూడా ఉంది. రూ.150 చెల్లించాల్సిన స్మార్డ్ కార్డ్ రూ.75లు చెల్లించి తీసుకోవచ్చు. ఈ మొత్తంలో రూ.20 తిరిగి చెల్లించనక్కరలేకుండానే ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఈ ఉగాది ఆఫర్‌ను వినియోగించుకుందుకు ప్రయాణీకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 6 లక్షలపైగా కార్డులను మెట్రో విక్రయించింది. స్మార్ట్ కార్డ్ రేటు తగ్గించడంతో ఈ కార్డుల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని మెట్రో ట్రైన్ సంస్థ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం