Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వు నేనా.. అలీ-దివ్యవాణిల మధ్య మాటల యుద్ధం.. ఇంతకీ ప్యాకేజీ ఎంత?

Advertiesment
ysr congress party
, బుధవారం, 3 ఏప్రియల్ 2019 (11:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతోంది. రాజకీయ నాయకులు నువ్వా నేనా అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయవేత్తలకు తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా సినీ నటులు కూడా తమ వంతుగా ఎన్నికల ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా.. కమెడియన్ అలీ, సినీనటి దివ్యవాణిల మధ్య వివాదం చోటుచేసుకుంది. అసలు విషయానికి వస్తే ఏపీలో పలు పార్టీలకు మద్దతుగా సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో టీడీపీ తరపున దివ్యవాణి, వైసీపీ తరపున అలీ కూడా ఉన్నారు. తాజాగా దివ్యవాణి మాట్లాడుతూ.. ప్యాకేజీ తీసుకుని వైసీపీలో అలీ చేరారంటూ విమర్శించారు. 
 
ఈ వ్యాఖ్యలపై అలీ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ప్యాకేజీ తీసుకున్నట్టు మీరేమైనా చూశారా? లేక సెల్ఫీ తీశారా? అంటూ నిలదీశారు. టీడీపీలో చేరేందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 
 
ముందు వెనకా ఆలోచించకుండా విమర్శలు చేయడం తగదన్నారు. కాగా, పెళ్లిపుస్తకం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దివ్యవాణి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే అలీ కూడా వైకాపా చీఫ్ జగన్ సమక్షంలో వైకాపాలోకి చేరిన సంగతి విదితమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మండిపోతున్న ఎండలు