కుక్కను చంపిన కిరాతకులు.. హేళన చేసిన పోలీసులు.. (Video)

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (15:15 IST)
తిరుపతి పట్టణంలోని లీలామహల్ సమీపంలో దారుణం జరిగింది. కొందరు కిరాతకులు ఓ కుక్కను అతి కిరాతకంగా చంపేసారు. కుక్క తల నరికి చంపేశారు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కుక్కను చంపిన వారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కుక్క యజమానురాలికి పోలీసుల నుంచి మరో అవమానం ఎదురైంది. కుక్క తండ్రి ఎవరు అంటూ హేళనగా మాట్లాడారు. మనుషులను చంపితేనే దిక్కులేదు.. ఇక కుక్కను చంపితే ఏంటి అంటూ ఖాకీలు ప్రశ్నించారు. దీంతో కుక్క యజమాని బోరున విలపిస్తూ మీడియాతో మాట్లాడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పక్కింటి పెంపుడు కుక్క అరుస్తుందన కారణంతో ఇద్దరు యువకులు పైశాచికంగా ప్రవర్తించారు. ఆ కుక్కను కత్తితో పొడిచి, తల తెగనరికి చంపేశారు. ఇంటి ముందు రాళ్లు విసురుకుంటే కుక్క అరిచింది. కోపంతో కుక్కను కత్తితో పొడిచి, తల నరికి కిరాతకులు చంపేశారు. తిరుపతిలోని లీలామహల్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద ఘటన చోటు చేసుకుంది.
 
దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు ఎగతాళి చేశారని కుక్క యజమాని లావణ్య ఆరోపించారు. కుక్క తండ్రి ఎవరు‌‌..? మనుషులను చంపితేనే దిక్కులేదు.. కుక్కను చంపడమేంటి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా ఎంతో అల్లారుముద్దుగా తమ కుక్కను పెంచుకున్నామని లావణ్య తీవ్ర మనోవేదనతో అన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments