Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను చంపిన కిరాతకులు.. హేళన చేసిన పోలీసులు.. (Video)

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (15:15 IST)
తిరుపతి పట్టణంలోని లీలామహల్ సమీపంలో దారుణం జరిగింది. కొందరు కిరాతకులు ఓ కుక్కను అతి కిరాతకంగా చంపేసారు. కుక్క తల నరికి చంపేశారు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కుక్కను చంపిన వారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కుక్క యజమానురాలికి పోలీసుల నుంచి మరో అవమానం ఎదురైంది. కుక్క తండ్రి ఎవరు అంటూ హేళనగా మాట్లాడారు. మనుషులను చంపితేనే దిక్కులేదు.. ఇక కుక్కను చంపితే ఏంటి అంటూ ఖాకీలు ప్రశ్నించారు. దీంతో కుక్క యజమాని బోరున విలపిస్తూ మీడియాతో మాట్లాడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పక్కింటి పెంపుడు కుక్క అరుస్తుందన కారణంతో ఇద్దరు యువకులు పైశాచికంగా ప్రవర్తించారు. ఆ కుక్కను కత్తితో పొడిచి, తల తెగనరికి చంపేశారు. ఇంటి ముందు రాళ్లు విసురుకుంటే కుక్క అరిచింది. కోపంతో కుక్కను కత్తితో పొడిచి, తల నరికి కిరాతకులు చంపేశారు. తిరుపతిలోని లీలామహల్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద ఘటన చోటు చేసుకుంది.
 
దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు ఎగతాళి చేశారని కుక్క యజమాని లావణ్య ఆరోపించారు. కుక్క తండ్రి ఎవరు‌‌..? మనుషులను చంపితేనే దిక్కులేదు.. కుక్కను చంపడమేంటి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా ఎంతో అల్లారుముద్దుగా తమ కుక్కను పెంచుకున్నామని లావణ్య తీవ్ర మనోవేదనతో అన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments