Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు : బిర్యానీ కోసం తలలు పగులగొట్టుకున్నారు...

Webdunia
శనివారం, 18 మే 2019 (14:56 IST)
పెళ్లి భోజనం అంటే పది రకాల వంటలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యాలతో పాటు.. నాన్‌వెజ్ వంటకాలు, స్వీట్లు, గారెలు ఉంటాయి. అందుకే పెళ్లి భోజనం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. పైగా, కడుపునిండా ఆరగించవచ్చు. అందుకే విందు భోజనానికి ప్రతి ఒక్కరూ పోటీపడతారు. 
 
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం అజ్జరం గ్రామంలోని ఓ ఇంటిలో ఏర్పాటు చేసిన పెళ్లి భోజనం కొట్లాటకు దారితీసింది. ఈ విందు భోజనంలో వేసిన చికెన్ బిర్యానీ కోసం అతిథులు ఘర్షణకు దిగారు. ఫలితంగా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తణుకు పాతూరుకు చెందిన వధువు తరుపు బృందం, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన వరుడి ఇంటి వద్ద వివాహ వేడుకకు శుక్రవారం ఉదయం వచ్చింది. పెళ్ళి తంతు ముగిసిన తర్వాత భోజనాలు చేస్తుండగా బిర్యానీ గురించి మాటామాటా పెరిగి వధువు, వరుడి వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. 
 
ఈ దాడిలో వరుడి తరుపున ఆరుగురికి, వధువు తరఫున ఆరుగురికి గాయాలయ్యాయి. పెళ్ళి మండపం వద్ద గొడవ జరుగుతోందని సమాచారం రావటంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే ఇరువర్గాలు కొట్టుకోవటంతో గాయాలైన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసామని ఎస్సై తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments