Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు : బిర్యానీ కోసం తలలు పగులగొట్టుకున్నారు...

Webdunia
శనివారం, 18 మే 2019 (14:56 IST)
పెళ్లి భోజనం అంటే పది రకాల వంటలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యాలతో పాటు.. నాన్‌వెజ్ వంటకాలు, స్వీట్లు, గారెలు ఉంటాయి. అందుకే పెళ్లి భోజనం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. పైగా, కడుపునిండా ఆరగించవచ్చు. అందుకే విందు భోజనానికి ప్రతి ఒక్కరూ పోటీపడతారు. 
 
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం అజ్జరం గ్రామంలోని ఓ ఇంటిలో ఏర్పాటు చేసిన పెళ్లి భోజనం కొట్లాటకు దారితీసింది. ఈ విందు భోజనంలో వేసిన చికెన్ బిర్యానీ కోసం అతిథులు ఘర్షణకు దిగారు. ఫలితంగా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తణుకు పాతూరుకు చెందిన వధువు తరుపు బృందం, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన వరుడి ఇంటి వద్ద వివాహ వేడుకకు శుక్రవారం ఉదయం వచ్చింది. పెళ్ళి తంతు ముగిసిన తర్వాత భోజనాలు చేస్తుండగా బిర్యానీ గురించి మాటామాటా పెరిగి వధువు, వరుడి వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. 
 
ఈ దాడిలో వరుడి తరుపున ఆరుగురికి, వధువు తరఫున ఆరుగురికి గాయాలయ్యాయి. పెళ్ళి మండపం వద్ద గొడవ జరుగుతోందని సమాచారం రావటంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే ఇరువర్గాలు కొట్టుకోవటంతో గాయాలైన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసామని ఎస్సై తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments