Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ పని తీరు మెరుగు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:34 IST)
గడిచిన రెండు మూడు నెలలుగా, కోవిడ్ కారణంగా తిరుమ‌ల ద‌ర్శ‌నం కోసం విడుదల చేసిన టిక్కెట్లు పరిమితం చేశారు. ఇది త‌క్కువ సంఖ్యలో ఉండడం వల్ల పోటీ పెరిగి, చాలా మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి  లక్షలాదిగా బుకింగ్ కి లాగిన్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో టీటీడీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 
 
దీనిని అతిక్రమించడం కోసం ఉన్న అతి తక్కువ సమయంలో వివిధ మార్గాలను అన్వేషించి, సాంకేతిక నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకుని ఎ.డ‌బ్ల్యూ ఎస్. క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కి వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఆ సమయంలో జియో యాజమాన్యం వారు తిరుమల శ్రీవారికి సేవలా భావించి, అన్నీ తామై సుమారు 2, 3 కోట్ల రూపాయల విలువ చేసే సర్వీస్ ను ఉచితంగా అందించారు.  
 
ఈ రోజు అనగా 24వ తేదీ తొమ్మిది గంటలకి తొలిసారిగా జియో క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసిన సమయంలో కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినా వెంటనే తగు చర్యలు చేపట్టి పరిష్కరించారు. సుమారు గంట సమయంలోనే రెండు ల‌క్ష‌ల టికెట్లు బుక్ చేసుకోగలిగారు.
 
తక్కువ సమయం ఉండటం కారణంగా తిరుపతి బాలాజీ పేరుతో సబ్ డొమైన్ తీసుకురావడం కుదరదు.  కాబ‌ట్టి జియో వారి సాఫ్ట్వేర్ మరియు క్లౌడ్ వాడుకుని టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్ ని ల్యాండింగ్ పేజీ గా వాడుకుని జియో మార్ట్ సబ్ డొమైన్ కి రూట్  చేయడం జరిగింది. తదుపరి టికెట్ల విడుదల సమయంలో ఈ సబ్ డొమైన్ కూడా తిరుపతి బాలాజీ పేరుతో ఉండబోతుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments