Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తితిదే వెబ్‌సైట్లలో సాంకేతిక లోపం.. నిలిచిన టిక్కెట్ల బుకింగ్

తితిదే వెబ్‌సైట్లలో సాంకేతిక లోపం.. నిలిచిన టిక్కెట్ల బుకింగ్
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:31 IST)
తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది. ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలుకు భారీగా భక్తులు ఒక్కసారిగా యత్నించడంతో సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. 
 
శుక్రవారం అక్టోబర్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. అక్టోబర్‌ 1 నుంచి 25 వరకు రోజుకు 8 వేల టికెట్లు చొప్పున అందుబాటులో ఉంచింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో తితిదే వెబ్‌సైట్‌ సర్వర్లు మొరాయించాయి. ఈ సాంకేతిక సమస్య కారణంగా వెబ్‌సైట్లు మొరాయించాయి. గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సమస్య వచ్చింది. జియో సర్వర్‌తో అనుసంధానించినప్పటికీ తిరిగి మళ్లీ సాంకేతిక లోపం ఏర్పడింది. 
 
దీన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లపై తితిదే ప్రకటన చేసే అవకాశముంది. కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా నెగెటివ్ రిపోర్టు వెంట తీసుకుని వెళ్ళాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు... నేటి నుంచీ ఐదేళ్ళ పదవీకాలం