తితిదే వెబ్‌సైట్లలో సాంకేతిక లోపం.. నిలిచిన టిక్కెట్ల బుకింగ్

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:31 IST)
తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది. ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలుకు భారీగా భక్తులు ఒక్కసారిగా యత్నించడంతో సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. 
 
శుక్రవారం అక్టోబర్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. అక్టోబర్‌ 1 నుంచి 25 వరకు రోజుకు 8 వేల టికెట్లు చొప్పున అందుబాటులో ఉంచింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో తితిదే వెబ్‌సైట్‌ సర్వర్లు మొరాయించాయి. ఈ సాంకేతిక సమస్య కారణంగా వెబ్‌సైట్లు మొరాయించాయి. గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సమస్య వచ్చింది. జియో సర్వర్‌తో అనుసంధానించినప్పటికీ తిరిగి మళ్లీ సాంకేతిక లోపం ఏర్పడింది. 
 
దీన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లపై తితిదే ప్రకటన చేసే అవకాశముంది. కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా నెగెటివ్ రిపోర్టు వెంట తీసుకుని వెళ్ళాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments