Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజిలెన్స్ అంచనాలు తప్పాయి .. అందుకే తొక్కిసలాట : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (13:01 IST)
ఇటీవలి తిరుమల కొండపై జరిగిన తొక్కిసలాటపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తితిదే విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనాలు తప్పడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై కింది స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
తిరుపతి ఎస్పీ గోశాలలో రూ.3 కోట్లతో నెయ్యి ఉత్పత్తి కేంద్రానికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తుల తొక్కిసలాటకు ప్రధాన కారణం విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనాలు తప్పడం వల్లే తోపులాట జరిగిందన్నారు. దీంతో పరిస్థితిని సమీక్షించే వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు.
 
ఈ వేసవిలో శ్రీవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు తగినట్టుగా తాము భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో టైమ్ స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కంపార్టుమెంట్లలో భక్తులను ఉంచి విడతల వారీగా శ్రీవారి దర్శనానికి పంపుతామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments