Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజిలెన్స్ అంచనాలు తప్పాయి .. అందుకే తొక్కిసలాట : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (13:01 IST)
ఇటీవలి తిరుమల కొండపై జరిగిన తొక్కిసలాటపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తితిదే విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనాలు తప్పడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై కింది స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
తిరుపతి ఎస్పీ గోశాలలో రూ.3 కోట్లతో నెయ్యి ఉత్పత్తి కేంద్రానికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తుల తొక్కిసలాటకు ప్రధాన కారణం విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనాలు తప్పడం వల్లే తోపులాట జరిగిందన్నారు. దీంతో పరిస్థితిని సమీక్షించే వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు.
 
ఈ వేసవిలో శ్రీవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు తగినట్టుగా తాము భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో టైమ్ స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కంపార్టుమెంట్లలో భక్తులను ఉంచి విడతల వారీగా శ్రీవారి దర్శనానికి పంపుతామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments