Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పవర్: వెనక్కి తగ్గిన తితిదే ఛైర్మన్

తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పవర్: వెనక్కి తగ్గిన తితిదే ఛైర్మన్
, మంగళవారం, 8 మార్చి 2022 (16:34 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఎప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ ఎలాంటి ఆలోచన లేకుండా చివరకు ఆ నిర్ణయంపై విమర్సలు వెల్లువెత్తితే వెనక్కి తగ్గడం చేస్తున్నారు. 

 
మరోసారి అలాంటి వివాదాల్లోకి వెళ్ళారు వై.వి.సుబ్బారెడ్డి. తిరుమలలో టిటిడి మాత్రమే భోజనం పెడుతుందని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పాత అన్నదాన భవనంలో అల్పాహారాన్ని అందిస్తామన్నారు. దాంతో పాటు ఏ రాష్ట్రం నుంచి వస్తే ఆ రాష్ట్రంలో వారు తినే భోజనాన్ని బట్టి అన్నింటిని అందిస్తామన్నారు. తిరుమలలో ప్రైవేటు హోటల్స్ లేకుండా టిటిడినే భక్తులందరికీ ఎంతో రుచికరమైన భోజనం ఇస్తుందన్నారు.

 
దీంతో ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్‌కు నోటీసులు ఇచ్చేశారు. ఇక మిగిలింది తిరుపతికి దింపేయడమేనని అందరూ భావించారు. ఆ ప్రాసెస్ అలా జరుగుతుండగానే మరోసారి టిటిడి ఛైర్మన్ సామాన్య భక్తులతో ఆడుకునే విధంగా మాట్లాడారు.

 
తిరుమలలోని 130 ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్స్, 30కి పైగా హోటళ్లను అలాగే ఉంచుతాం.. అయితే భక్తులకు చపాతీ, రోటీలను కూడా పెడతామన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో ప్రైవేటు హోటల్స్ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాయని.. అధిక ధరలను వసూలు చేస్తున్నాయని ఫిర్యాదు వెళితేనే ఈ నిర్ణయం తీసుకున్న ఛైర్మన్ చివరకు రాజకీయ ఒత్తిడితో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

 
రాజకీయ నాయకుల నుంచి ఎక్కువ ఒత్తిడి రావడంతో వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకున్నారు టిటిడి ఛైర్మన్. దీన్నిబట్టి తిరుమలలో ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ అలాగే కొనసాగనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ రైతులకు విజ్ఞప్తి .. సీఆర్డీఏ అధికారుల తిప్పలు