Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తున్న అమరావతి రైతులను అడ్డుకోండి : వైవీఎస్ పిలుపు

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (12:33 IST)
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వస్తున్న అమరావతి ప్రాంత రైతుల దండయాత్రను అడ్డుకోవాలని తితిదే ఛైర్మన్, వైకాపా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వాసులకు పిలుపునిచ్చారు. 
 
విశాఖ నార్త్ కార్యాలయంలో వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు అమరావతి రైతులు వస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో దండయాత్రకు వస్తున్న వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖను రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. 
 
విశాఖ అభివృద్ధి ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలని, ఇపుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని వైవీఎస్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments