Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తున్న అమరావతి రైతులను అడ్డుకోండి : వైవీఎస్ పిలుపు

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (12:33 IST)
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వస్తున్న అమరావతి ప్రాంత రైతుల దండయాత్రను అడ్డుకోవాలని తితిదే ఛైర్మన్, వైకాపా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వాసులకు పిలుపునిచ్చారు. 
 
విశాఖ నార్త్ కార్యాలయంలో వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు అమరావతి రైతులు వస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో దండయాత్రకు వస్తున్న వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖను రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. 
 
విశాఖ అభివృద్ధి ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలని, ఇపుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని వైవీఎస్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments