Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు - రేపు కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు

rain
, బుధవారం, 5 అక్టోబరు 2022 (08:24 IST)
కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింద. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి వ్యాపించివుంది. ఈ కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ముఖ్యంగా కోస్తాంధ్రలో ఒకటి రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అప్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది బుధవారం నాటికి ఏపీ తీరానికి చేరుకోవచ్చని పేర్కొంది. 
 
దీని ప్రభావం కారణంగా కోస్తాంధ్రలో పలు చోట్ల రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర తీరంలో 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాదులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యుకారులు మూడు రోజుల పాటు వేటకు దూరంగా ఉండాలని సూచన చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన... టీడీపీ చీఫ్ చంద్రబాబు